కోఆప్షన్లపై గందరగోళం | - | Sakshi
Sakshi News home page

కోఆప్షన్లపై గందరగోళం

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

● మొత్తం దరఖాస్తు చేసుకున్న వారిలో నలుగురి ని అధికారులు అనర్హులుగా ప్రకటించారు. ఇందులో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగం సతీమణి లక్ష్మీ ఉండడం గమనార్హం. ● 2014లో కాంగ్రెస్‌ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికై న ఆమె.. ఆ సమయంలో జరిగిన చైర్‌పర్సన్‌ ఎన్ని కలో పార్టీ విప్‌ను ధిక్కరించారు. తర్వాత కొన్ని రోజులకే ఆమె సభ్యత్వాన్ని కోల్పోయారు. ● స్థానిక సంస్థల్లో ఐదేళ్ల పదవి కాలం పూర్తి చేసుకున్న వారే మాజీ ప్రజాప్రతినిధుల కోటాలో కోఆప్షన్‌ పదవికి అర్హులు. కేవలం కొన్ని నెలలు మాత్రమే ఆమె ఆ పదవిలో ఉండడంతో అధికారులు అనర్హురాలిగా తేల్చారు. ● ఆమెతో పాటు ప్రత్యేక ప్రావీణ్యం కోటా కింద దరఖాస్తు చేసుకున్న కొమిరెడ్డి శేషగిరి, కొమిరెడ్డి శిరీష, పులిమామిడి ప్రవీణ్‌ను అనర్హులుగా ప్రకటించారు. ● కోఆప్షన్‌ ఎన్నిక ప్రక్రియ గందరగోళంగా మారడంతో పలువురు కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. ● మొదట తమను అర్హులుగా ప్రకటించి.. తర్వాత అనర్హులుగా తేల్చడంపై సంబంధిత దరఖాస్తుదారులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 24న నిర్వహించతలపెట్టిన కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపాలిటీలో కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ గందరగోళంగా మారింది. ఈ ఎన్నికకు సంబంధించిన పలు విషయాల్లో అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కౌన్సిలర్లతోపాటు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ముందుగా ఈనెల 23న ఎన్నిక చేపట్టాలని నిర్ణయించారు. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ఎజెండాలో పొందుపరుస్తూ ఆ ప్రతులను కౌన్సిలర్లకు ఆదివారం పంపిణీ చేశా రు. మొత్తం నాలుగు పదవులకు 24మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో ఎవరినీ అనర్హులు గా గుర్తించకుండానే ఎజెండాలో అందరి పేర్లు చే ర్చారు. కౌన్సిలర్లకు ఇచ్చిన ఎజెండా ప్రతులను మరుసటిరోజు వెనక్కి తీసుకున్న అధికారులు.. మార్పులు చేసి మళ్లీ మంగళవారం తిరిగి కౌన్సిలర్లకు అందించారు. అయితే అందులో ఎన్నిక తేదీని 24కు మార్చడంతోపాటు కొందరు అభ్యర్థులు అనర్హులని పేర్కొనడం వివాదానికి దారి తీసింది. నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తులను అధికా రులు పరిశీలించి అందులో అనర్హులుంటే వారిని పోటీ నుంచి తప్పించాలి. కానీ అలా చేయకుండానే తొలుత అందరి పేర్లతో కూడిన ఎజెండా ప్రతులను పంపిణీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అనర్హుల్లో కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడి సతీమణి

న్యాయ పోరాటానికి

సిద్ధమవుతున్న పలువురు

అనర్హులను గుర్తించకుండానే కౌన్సిలర్లకు ఎజెండా ప్రతులు

తర్వాత వెనక్కి తీసుకుని మరో ఎజెండా అందజేత

అందులో నలుగురిని అనర్హులుగా ప్రకటించిన వైనం

వివాదాస్పదమైన మెట్‌పల్లి మున్సిపల్‌ అధికారుల తీరు

Advertisement
 
Advertisement
Advertisement