బల్దియాకు రూ.1.80 లక్షల పన్ను చెల్లింపు | - | Sakshi
Sakshi News home page

బల్దియాకు రూ.1.80 లక్షల పన్ను చెల్లింపు

Jun 19 2025 4:40 AM | Updated on Jun 19 2025 4:40 AM

బల్ది

బల్దియాకు రూ.1.80 లక్షల పన్ను చెల్లింపు

ధర్మపురి: ధర్మపురి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం బల్దియాకు బకాయి పడిన రూ.1,80,614 బుధవారం చెల్లించింది. బకాయి పడిన పన్ను చెల్లించాలని మార్కెట్‌ కార్యాలయానికి ఇటీవల బల్దియా నోటీసులు జారీ చేసింది. దీంతో స్పందించిన ఏఎంసీ చైర్‌పర్సన్‌ చిలుముల లావణ్య, ఇన్‌చార్జి కార్యదర్శి వెంకటనర్సయ్య రూ.1,80,614 విలువైన చెక్కును మున్సిపల్‌ సిబ్బందికి అందించారు.

కాకతీయ కాలువ గండ్లు పూడుస్తాం

ఇబ్రహీంపట్నం: ఎస్సారెస్పీ కాకతీయ కాలువకు పడిన గండ్లను పూడ్చివేస్తామని ప్రాజెక్టు ఈఈ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా సరిహద్దు ఉప్లూర్‌ నుంచి కాకతీయ కాలువకు పడిన గండ్లను సిబ్బందితో కలిసి బుధవారం పరిశీలించారు. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసేలోగా కాంట్రాక్టర్లతో పనులను వేగవంతంగా పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. కాకతీయ కాలువకు ఇరువైపులా కొంతమంది రైతుల భూములు కబ్జా చేస్తున్నారని, వాటిని పరిశీలించాలని కాలువ హద్దులు దాటి భూములు కబ్జా చేసే రైతులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఈ దేవనందం, ఏఈ సజీత్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో వైద్య కళాశాల భవిష్యత్‌ ప్రశ్నార్థకం

జగిత్యాల: కాంగ్రెస్‌ పాలనలో జిల్లాలోని వైద్య కళాశాల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. స్థానిక బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వైద్య కళాశాలను ప్రారంభిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ప్రశ్నార్థకంగా మారిందన్నారు. జగిత్యాల వైద్య కళాశాలకు నోటీసులు రావడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్సీ కవిత సహకారంతో జిల్లాకు వైద్య కళాశాల సాధించుకున్నామని, పాలన వదిలేసి ప్రతికార చర్యలతోనే ఈ దుస్థితి నెలకొందన్నారు. ఆమె వెంట నాయకులు మహిపాల్‌రెడ్డి, మహేశ్‌ పాల్గొన్నారు.

వరదలపై అప్రమత్తంగా ఉండండి

మెట్‌పల్లి/కోరుట్ల: రానున్న వర్షకాలంలో వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ సూచించారు. కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్‌ సమావేశ మందిరాల్లో సిబ్బందితో బుధవారం సమావేశమయ్యారు. అధికారులకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందుల కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వేంపేట రోడ్డులో ఉన్న రైల్వేవంతెన కింద ప్రతి సీజన్‌లో వరద నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి దృష్టి సారించాలన్నారు. బల్దియా కమిషనర్‌ మోహన్‌, డీఈ నాగేశ్వర్‌రావు, పలు విభాగాల సిబ్బంది ఉన్నారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ మండలాలకు చెందిన 41మందికి రూ.10.05లక్షల విలువైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందించారు.

కోరుట్లలో..

కోరుట్లటౌన్‌: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులు అందించారు. కోరుట్ల తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ చైతన్య ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క బహూకరించారు.

బల్దియాకు రూ.1.80 లక్షల పన్ను చెల్లింపు1
1/3

బల్దియాకు రూ.1.80 లక్షల పన్ను చెల్లింపు

బల్దియాకు రూ.1.80 లక్షల పన్ను చెల్లింపు2
2/3

బల్దియాకు రూ.1.80 లక్షల పన్ను చెల్లింపు

బల్దియాకు రూ.1.80 లక్షల పన్ను చెల్లింపు3
3/3

బల్దియాకు రూ.1.80 లక్షల పన్ను చెల్లింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement