
చీకట్లో దొంగల మర్రి జంక్షన్
కొడిమ్యాల: కొండగట్టు నుంచి కరీంనగర్ వెళ్లే జాతీయ రహదారి మార్గంలో.. కొడిమ్యాల మండలం నాచుపల్లి సమీపంలోని దొంగలమర్రి జంక్షన్ వద్ద చీకట్లు అలుముకున్నాయి. వీధి దీపాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నా రు. గతంలో ఈ ప్రాంతం దొంగతనాలు, దోపిడీల కు అడ్డగా ఉండేది. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్పీ అనంతశర్మ అక్కడ చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం.. వీధి దీపాలు పెట్టడంతో భయం తగ్గినా.. కొద్దిరోజులుగా చీకటి కారణంగా మళ్లీ ఆ జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని స్థానికులు అంటున్నారు. వా హనదారులు, ఈ ప్రాంతాన్ని దాటేటప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తక్షణమే అక్కడ లైట్లను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

చీకట్లో దొంగల మర్రి జంక్షన్