
తప్పెవరిది.. శిక్ష ఎవరికి..?
జగిత్యాలఅగ్రికల్చర్/కోరుట్లరూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనావాసాల్లోనే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు.
అయితే వాటికి ఎలాంటి రక్షణ ఏర్పాటు చేయలేదు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి స్తంభాలకు అల్లుకున్నాయి.
ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. చాలాచోట్ల విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. మూడు రోజుల క్రితం కోరుట్లలో వేలాడుతున్న వైర్లు తాకి ఇద్దరు కూలీలు చనిపోయిన విషయం తెల్సిందే. మరో ఎనిమిది మంది వరకు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడే కాకుండా.. సంఘటన చోటుచేసుకోకముందే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

తప్పెవరిది.. శిక్ష ఎవరికి..?

తప్పెవరిది.. శిక్ష ఎవరికి..?

తప్పెవరిది.. శిక్ష ఎవరికి..?