● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాలరూరల్: నిరుపేదల వైద్యానికి ప్రభుత్వం చేయూతనందిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. బుధవారం సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన సట్టల వివేక్ వెన్నుపూస సమస్యతో బాధపడుతుండగా శస్త్ర చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ.1.75 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొలపాక లక్ష్మీరాజం, నాయకులు మర్రిపల్లి రాజేశం, గంగరాజం, శ్రావణ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చొరవ
జిల్లాకేంద్రంలోని మార్కెట్ ప్రాంతానికి చెందిన రెవేల్ల రవిగౌడ్ (50) ఇజ్రాయిల్లో గుండెపోటుతో మృతిచెందగా.. ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎమ్మెల్యే చొరవ చూపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావును కలిసి ఆయన ద్వారా ఇజ్రాయిల్లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించారు.
జర్నలిస్ట్ల సమస్యలు పరిష్కరిస్తా
జగిత్యాల: జర్నలిస్ట్ల సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే అన్నారు. జిల్లాకేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్స్లో వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహాసభ నిర్వహించగా.. ఎమ్మెల్యే హాజరయ్యారు. వారికి ఐడీ కార్డులు అందించారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జ్యోతి, రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య, నాగయ్య పాల్గొన్నారు.
నాణ్యత లేకుంటే చర్యలు
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. జిల్లాకేంద్రంలోని 31వ వార్డులో టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టిన సీసీరోడ్డు పనులను బుధవారం పరిశీలించారు. నాణ్యత లేకుండా పనులు చేయొద్దని, అధికారులు ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు.