
కొండగట్టు అంజన్నకు జ్యేష్టాభిషేకం
మల్యాల:వర్షాలు సకాలంలో.. సమృద్ధిగా కురిసి.. పంటలు పండాలని ఏటా కొండగట్టు ఆంజనేయస్వామి వారి జన్మనక్షత్రమైన పూర్వాభద్ర నక్షత్రం సందర్భంగా బుధవారం జ్యేష్టాభిషేకం నిర్వహించారు. ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో ప్రతిష్టించి, వాసుదేవ పుణ్యహవచనం గావించారు. 108 కలశాల్లోని సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పట్టువస్త్రాలతో అలంకరించారు. ఈఓ శ్రీకాంత్రావు, స్థానాచార్యులు కపీంద్ర, ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్రస్వామి, రామకృష్ణ, రఘు, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి, పి.రాంచంద్రస్వామి, ముఖ్య అర్చకులు తిరుకోవెల లక్ష్మణ్, చిన్న జితేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.

కొండగట్టు అంజన్నకు జ్యేష్టాభిషేకం