భారత్‌కు వాన్స్‌  | USa vice president JD Vance likely in India on 21 Apr 2025 | Sakshi
Sakshi News home page

భారత్‌కు వాన్స్‌ 

Apr 12 2025 4:35 AM | Updated on Apr 12 2025 4:35 AM

USa vice president JD Vance likely in India on 21 Apr 2025

ఏప్రిల్‌ 21–24 మధ్య పర్యటన 

సతీసమేతంగా రానున్న ఉపాధ్యక్షుడు 

‘సెకండ్‌లేడీ’గా తొలిసారి స్వదేశానికి ఉష 

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీసమేతంగా భారత్‌కు వస్తున్నారు. భార్య ఉషా చిలుకూరి వాన్స్‌తో కలిసి ఏప్రిల్‌ 21 నుంచి మూడు రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటిస్తారని సమాచారం. ఉషవి తెలుగు మూలాలున్న విషయం తెలిసిందే. అమెరికా సెకండ్‌ లేడీ హోదాలో ఆమె భారత్‌ రానుండటం ఇదే తొలిసారి. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడటం తెలిసిందే. 

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తదితరులతో వాన్స్‌ భేటీ కానున్నారు. వాణిజ్య తదితర రంగాలకు సంబంధించి ఈ సందర్భంగా వారి మధ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా, భారత్‌ మధ్య కీలక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశముంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌ కూడా ఏప్రిల్‌ 21–24 తేదీల్లోనే భారత్‌లో పర్యటించనున్నారు. వాన్స్‌ ఉన్నతస్థాయి చర్చల్లో ఆయన కూడా భాగస్వామి కానున్నారు.

తాజ్‌మహల్‌ సందర్శన 
భారత పర్యటన సందర్భంగా వాన్స్‌ దంపతులు తాజ్‌మహల్‌ను కూడా వీక్షించనున్నారు. ఆగ్రాతో పాటు జైపూర్‌ను కూడా వాళ్లు సందర్శిస్తారని తెలుస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement