దానం నాగేందర్‌ బదులు.. పీఏ చంద్రశేఖర్‌.. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే ఎవరు?

- - Sakshi

బంజారాహిల్స్‌: బీఆర్‌ఎస్‌లో గ్రూపు తగాదాలను నివారించి నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం చేసుకుంటూ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశలో అధిష్టానం ఓ బృహత్తర పథకాన్ని ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఏ గ్రూపు తగాదాలను నివారించాలని ఈ కార్యక్రమం తలపెట్టారో ఆ గ్రూపు తగాదాలతోనే ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో కొన్ని డివిజన్లలో ఇప్పటి వరకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించలేక ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ చేతులెత్తేశారు.

కొన్ని డివిజన్లలో ఎమ్మెల్యేకు, కార్పొరేటర్లకు పొసగక, మరికొన్ని డివిజన్లలో నేతల మధ్య విభేదాలు, ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు సానుకూల వాతావరణం లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించలేదు.

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌ డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్‌లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ డివిజన్లలో ఇప్పటిదాకా వాటి ఊసే ఎత్తడం లేదు.

ఇప్పటి వరకు కొన్ని డివిజన్లలో జరిగిన ఆత్మీ య సమ్మేళనాలు అంతగా విజయవంతమైనట్లుగా కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు ఆత్మీయ సమ్మేళనాలపై నియోజకవర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందిస్తుండగా ఖైరతాబాద్‌లో ఈ సమ్మేళనం అంత ఉత్సాహంగా, సానుకూల వాతావరణంలో జరగలేదని మంత్రి కేటీఆర్‌కు నివేదికలు వెళ్లాయి. ఇంకా రెండు డివిజన్లలో నిర్వహించాల్సిన సమ్మేళనాలు అటకెక్కాయి.

బంజారాహిల్స్‌లో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కార్పొరేటర్‌గా ఉన్నారు. ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయలేదు.

జూబ్లీహిల్స్‌ డివిజన్‌లో మూడు, నాలుగు గ్రూపులు బీఆర్‌ఎస్‌లో వేరు కుంపట్లు పెట్టాయి. ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం అంటే అంత తేలిక కాదని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే దాని ఊసే ఎత్తడం లేదు. ప్రతి డివిజిన్‌లోనూ బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య సఖ్యత కుదరడం లేదు.

ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు తమదేనంటూ ప్రచారం చేసుకుంటుండటంతో కార్యకర్తలు ఎవరిని నమ్మాలో తెలియకుండా ఉంది.

పార్టీ శ్రేణులు అన్నింటినీ కలుపుకొని పోవాల్సిన ఎమ్మెల్యే దానం ఆ దిశలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో అధిషానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం. ఈ వర్గ విభేదాలు ఎన్నికల నాటికి సమసిపోకపోతే ఈ అవకాశాన్ని కాంగ్రెస్‌, బీజేపీలు సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని స్వయంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలే వాపోతున్నారు.

ఎమ్మెల్యే సారు బిజీగా ఉన్నారు...
హిమాయత్‌నగర్‌: ‘ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సార్‌ చాలా బిజీగా ఉన్నారు. అందుకే డివిజన్‌ పర్యటనకు నేను హాజరయ్యాను’ అని ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్‌ అన్నారు. పీఏ చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలపై స్థానికులు అవాక్కయ్యారు. బుధవారం హిమాయత్‌నగర్‌ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు యాదగిరి నేతృత్వంలో జీహెచ్‌ఎంసీ ఈఈ పేర్రాజుతో కలసి పీఏ చంద్రశేఖర్‌ పర్యటించారు.

స్ట్రీట్‌ నెంబర్‌–2లో డ్రైనేజీ సమస్య ఉండటంతో ఇక్కడ పైప్‌లైన్‌ మంజూరైంది. ఈ పైప్‌లైన్‌ పనులు చేసేందుకు కాంట్రాక్టర్‌ ముందుకు రాకపోవడంతో పీఏకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇదే ప్రాంతంలో కరెంట్‌ పోల్‌ను రీప్లేస్‌ చేయాలని కోరారు. భగ్గీఖానా, స్ట్రీట్‌ నెంబర్‌–4లోని పూర్తిగా ధ్వంసమైన రోడ్లను త్వరితగతిన మరమ్మతులు చేయాలని ఈఈ పేర్రాజును పీఏ చంద్రశేఖర్‌ కోరారు. స్థానికులు, నాయకులు తన దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యనూ ఎమ్మెల్యే దానంకు వివరించి సత్వరమే పరిష్కరించేలా కృషి చేస్తానంటూ పీఏ చంద్రశేఖర్‌ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దానం రావాల్సిన పర్యటనలో ఆయన పీఏ రావడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-11-2023
Nov 17, 2023, 11:59 IST
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని పరిగెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రధాన ఘట్టానికి రెండు...
17-11-2023
Nov 17, 2023, 11:49 IST
సాక్షి, నిజామాబాద్‌: 58 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఎన్నో గోసలు పడ్డాం. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపిండ్రు. ఎన్నో పోరాటాల అనంతరం...
17-11-2023
Nov 17, 2023, 10:14 IST
సాక్షి, ఆదిలాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు కామన్‌ సింబల్‌ ఉండగా వారు ఇప్పటికే...
17-11-2023
Nov 17, 2023, 09:55 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ‘కరెంట్‌ కావాల్నా.. కాంగ్రెస్‌ కావాల్నా.., రైతుబంధు కావాల్నా.. రాబందా?..’ అంటూ సీఎం కేసీఆర్‌ ప్రజాఆశీర్వాద సభల్లో సభికులను...
17-11-2023
Nov 17, 2023, 08:37 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎన్ని సంస్కరణలు తెచ్చినా..ఎన్నిమార్లు సవరణలు చేసినా..ఎంత మంది ఫిర్యాదులు చేసినా ఓటరు లిస్టులో మాత్రం తప్పుల్ని నివారించలేకపోతున్నారు....
17-11-2023
Nov 17, 2023, 08:04 IST
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరగాలంటే రాష్ట్ర పోలీసులతో పాటు సాయుధ దళాల బందోబస్తు కూడా ఎంతో ముఖ్యం. ఆ...
17-11-2023
Nov 17, 2023, 04:44 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 28,057 మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం...
17-11-2023
Nov 17, 2023, 04:31 IST
సాక్షి, ఆదిలాబాద్‌/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో బీదాబిక్కీ, చిన్నాపెద్ద, కులమతా లకు...
17-11-2023
Nov 17, 2023, 03:39 IST
చెరుపల్లి వెంకటేశ్‌: కార్పొరేటర్‌ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్‌ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ  చాలామంది...
17-11-2023
Nov 17, 2023, 03:02 IST
యెన్నెల్లి సురేందర్‌ : మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021వరకు ఎంతో సాన్నిహిత్యం, అనుబంధం ఉన్న సీఎం కేసీఆర్, మాజీ...
17-11-2023
Nov 17, 2023, 01:24 IST
కరీంనగర్‌/కరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌ ప్రజల ఆశీర్వాదం, సీఎం కేసీఆర్‌ సహకారంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదేళ్లలో...
17-11-2023
Nov 17, 2023, 01:24 IST
కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో మాట్లాడి స్మార్ట్‌ సిటీ కింద నిధులు తీసుకొస్తే ఎవడబ్బ సొమ్మని బీఆర్‌ఎస్‌...
17-11-2023
Nov 17, 2023, 01:22 IST
మంచిర్యాలక్రైం: ఎన్నికల వేళ మావోయిస్టు లేఖలు కుమురంభీం జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల 14న భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)...
17-11-2023
Nov 17, 2023, 01:22 IST
సాక్షి, కామారెడ్డి: 'వీఐపీ అభ్యర్థులు బరిలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలో ‘బిగ్‌’ ఫైట్‌ నడుస్తోంది. ఇక్కడ 39 మంది పోటీలో...
17-11-2023
Nov 17, 2023, 01:20 IST
కరీంనగర్‌ అర్బన్‌: ఎన్నికలొచ్చాయంటే చాలు.. వివిధ రకాల పేర్లు డోలయమానంలో పడేస్తుంటాయి. అర్థం తెలియక అవగాహన లేని వారెందరో. ప్రిసైడింగ్‌...
17-11-2023
Nov 17, 2023, 01:20 IST
సారంగాపూర్‌(జగిత్యాల): ఓటర్లను మభ్యపెట్టి, తాయిళాలు ఇచ్చి, ఓటు వేయించేందుకు ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని డీఎస్సీ వెంకటస్వామి హెచ్చరించారు. సారంగాపూర్‌ మండలంలోని...
17-11-2023
Nov 17, 2023, 01:00 IST
నిర్మల్‌చైన్‌గేట్‌: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ఏఐసీసీ...
17-11-2023
Nov 17, 2023, 01:00 IST
నిర్మల్‌: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అధి కారికంగా గుర్తుల కేటాయింపు ఖరారైంది. బీఫాంలను అందించిన ప్రధాన పార్టీలకు ముందే...
17-11-2023
Nov 17, 2023, 00:39 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయి...
17-11-2023
Nov 17, 2023, 00:38 IST
ఆర్మూర్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్‌ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ నెలకొననుంది. నామినేషన్లు, ఉపసంహరణల అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో...



 

Read also in:
Back to Top