
మృతుడు మహేందర్
జీడిమెట్ల: పరిశ్రమలో బాయిలర్ శుభ్రపరుస్తుండగా పొట్టలో గాయం అవ్వడంతో ఓ కార్మికుడు మృతిచెందిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ పవన్ వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా సూర్యనగర్కు చెందిన లక్ష్మణ్ కుమారుడు మహేందర్(28) మూడున్నర సంవత్సరాలుగా జీడిమెట్లలోని హెటేరో–3యూనిట్లో ప్రొడక్ట్స్ మిక్స్ ఆపరేటర్గా పనిచేస్తూ సూరారం రాజీవ్గాంధీనగర్లో ఉంటున్నాడు.
రోజు మాదిరిగానే బుధవారం డ్యూటీకి వచ్చాడు. పరిశ్రమలో రియాక్షన్ అనంతరం బాయిలర్ను శుభ్రపరుస్తున్నాడు. ఈ క్రమంలో యంత్రంలో బ్లేడ్స్ తగిలి గాయం అవడంతో పరిశ్రమ సిబ్బంది మహేష్ను మల్లారెడ్డి అస్పత్రికి తరలించారు. పరీక్షించిన డా. మహేందర్ అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.