
ఏఎన్ఎంలు, బస్తీ దవాఖానాల వైద్యులకు శిక్షణ ఇస్తున్న డాక్టర్ కార్తీక్
వెంకటేశ్వరకాలనీ: కేసీఆర్ కిట్ అందుకున్న వారి చిన్నారుల వ్యాక్సినేషన్ ప్రక్రియను గతంలో నెల, మూడున్నర నెలలు, తొమ్మిది నెలలు, ఏడాదిన్నరకు నమోదు చేసేవారని కానీ ఇప్పుడు ప్రతి నెలా పోర్టల్లో నమోదు చేయాలని బంజారాహిల్స్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యుడు కార్తీక్ సూచించారు. కేసీఆర్ పోర్టల్లో నూతనంగా వచ్చిన మార్పులపై శ్రీరాంనగర్ క్లస్టర్ పరిధిలోని యాక్టివ్ ఏఎన్ఎంలు, వైద్యులకు ఆయన గురువారం ఆస్పత్రి ఆవరణలో శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న మార్గదర్శకాల్లో భాగంగా ప్రతి నెలా యాంటిజెన్ వ్యాక్సిన్లు వేస్తున్నామని కేసీఆర్ కిట్ అందుకున్న మహిళలు త చిన్నారులకు ఆ వ్యాక్సిన్లు వేయించడంతో పాటు ప్రతి నెలా పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ఒక వేళ వారు ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే వెంటనే సంబంధిత ఆశా వర్కర్ను అక్కడికి పంపించి వ్యాక్సిన్లు వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు హస్రిత, సుభాన్, దీప్తిశ్రీ, ఏఎన్ఎంలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.