మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

Jun 19 2025 3:50 AM | Updated on Jun 19 2025 3:50 AM

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

వీ–హబ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఊహ సజ్జ

హన్మకొండ అర్బన్‌: జిల్లాలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు వీ–హబ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఊహ సజ్జ తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్‌లో ఎస్‌హెచ్‌జీలు, మహిళా పారిశ్రామివేత్తలకు ‘ఎంఎస్‌ఎంఈ ర్యాంప్‌ ఉమెన్‌ యాక్సెలరేషన్‌ పథకం’పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఎంపికై న మహిళా పారిశ్రామివేత్తలు తమ వ్యాపారాలను అభివృద్ధిని చేసుకొని ఆదా యాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుందని సూచించారు. ఇందులో భాగంగా టెక్స్‌టైల్‌, ఫుడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, హస్తకళల రంగాల్లోని వ్యాపారులకు వ్యాపార నైపుణ్యాలపై శిక్షణ, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, సరఫరా, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ యా క్సెస్‌, క్రెడిట్‌ లింకేజీ మద్దతు అందుతుందని తెలిపారు. అనంతరం ఔత్సాహిక మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సదస్సులో డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, ఇండస్ట్రీస్‌ జీఎం నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement