
ట్రై సిటీలో పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు
ఐదు నెలల్లో 254 మందికి జైలు కేసులు 8,482.. జరిమానా రూ.85,83,769 మైనర్ డ్రైవింగ్ కేసుల్లో జైలుకు 91మంది కోర్టు కానిస్టేబుళ్ల హవా
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం మత్తు అని గుర్తించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ట్రై సిటీ(హనుమకొండ, కాజీపేట, వరంగల్) పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ముమ్మరం చేశారు. సాయంత్రం 6 గంటల దాటితే ప్రధాన రోడ్లపై పోలీసులు ఎటువైపు నుంచి వచ్చి పరీక్షలు చేస్తారో తెలియని పరిస్థితి. ట్రైసిటీలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో జనవరి నుంచి మే వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 8,482 నమోదు కాగా 85,83,769 రూపాయల వరకు జరిమానాలు చెల్లించారు. దీనిని బట్టి మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఏ మేరకు కొరడా ఝుళిపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. –వరంగల్ క్రైం
జరిమానాలు..
జైలు జీవితమే..
జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ వాహనదారులకు రూ.28,96,960 జరిమానా విధించారు. ఇక కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.30,27,909, వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.26,58,900 జరిమానా విధించారు. దీంతోపాటు అధికంగా మద్యం సేవించిన 260మంది జైలుకు వెళ్లారు.
మైనర్ల డ్రైవింగ్పై
పోలీసుల ప్రత్యేక దృష్టి
మైనర్లకు వాహనాలు అప్పగించవద్దని పోలీస్ అధికారులు తల్లిదండ్రులకు పదే పదే చెప్పిన ఎవరూ వినడం లేదు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సన్ప్రీత్ సింగ్ మైనర్ల డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు పోలీసులకు పట్టుబడిన మైనర్ డ్రైవింగ్ కేసుల్లో 91 మంది జైలుకు వెళ్లారు.
కోర్టు కానిస్టేబుళ్ల హవా..
సందట్లో సడేమియాలాగా.. డ్రంకెన్ డ్రైవ్ కేసులు కొంతమంది పోలీస్ అధికారులకు కాసుల వర్షం కురిస్తున్నాయి. మద్యం తాగి పోలీసులకు దొరికిన విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అనుకునే వారు పోలీసుల డిమాండ్లకు తలొగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇక కోర్టుకెళ్తే అక్కడి కోర్టు కానిస్టేబుళ్లు మరో దందాకు తెరలేపుతున్నారు. వాహనాల కాగితాలు లేవు.. రీడింగ్ ఎక్కువ వచ్చింది..అంటూ భయపెట్టి డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ట్రాఫిక్లో కోర్టు కానిస్టేబుళ్ల పోస్టుకు చాలా డిమాండ్ ఉండడంతో అదే పోస్టులో ఉండటానికి అధికారులు మారినప్పుడల్లా వారి ప్రయత్నాలు చాలా ఖరీదుగా ఉంటాయన్న ప్రచారం ఉంది.
ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో..
నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ప్రధాన ట్రాఫిక్ కూడళ్లతోపాటు వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లకు సమీపంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో వాహనాదారులు అక్కడ అమ్ముడు ఎందుకు...?; ఇక్కడ పరీక్షలు ఎందుకు చేస్తున్నారు అని అసహనం వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. మోతాదుకు మించి మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులకు మాత్రం జైలు జీవితం తప్పడం లేదు.
మొత్తం కేసులు
2,620
జనవరి
ఫిబ్రవరి
మార్చి
ఏప్రిల్
మే
2,788
2,774
జైలుకు..
జనవరి నుంచి మే వరకు ట్రైసిటీలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఇలా..

ట్రై సిటీలో పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు

ట్రై సిటీలో పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు