
ఆట మొదలైంది..!
వరంగల్ అర్బన్: జీడబ్ల్యూఎంసీని గాడిలో పెట్టేందుకు కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సీరియస్గా దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల తర్వాత కదనరంగంలోకి దిగారు. తెల్ల వారు జామునుంచి పొద్దుపోయే వరకు ప్రజాక్షేత్రంలో ఉంటూనే.. మరోవైపు వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షలు, సమావేశాలు, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. కమిషనర్ ఆకస్మిక తనిఖీలు, సందర్శనలతో నిద్ర, మాముళ్ల మత్తులో మునిగి తేలిన కొంతమంది అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
గడువులోగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
అభివృద్ధి పనులను గడువులోగా పూర్తిచేయాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా 66 డివిజన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్బాబు, మధులత, స్మార్ట్ సిటీ పీఎంసీ ఆనంద్ ఓలేటి, తదితరులు పాల్గొన్నారు.
నగరంలో తనిఖీలు..
నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. హసన్పర్తి సమీపంలోని జంతువుల శస్త్రచికిత్స కేంద్రం వివరాలు, తిరుమల జంక్షన్ ప్రాంతంలో నాలా స్మార్ట్సిటీ పనుల పురోగతిని తెలుసుకున్నారు. బాలసముద్రంలో గ్రేటర్ నిర్వహిస్తున్న రెండు నర్సరీలు, గోకుల్నగర్లో రోడ్డు డ్రైన్, రాజాజీనగర్లో రిటైనింగ్ వాల్ పనులు, పైడిపల్లి, మడికొండలో రోడ్లను తనిఖీ చేశారు. రాంపూర్ డంపింగ్ యార్డును సందర్శించి బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 45, 46 డివిజన్లలోని కడిపికొండ, రామన్నపేట ప్రాంతాలను ఆమె సందర్శించారు. వంద రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని కమిషనర్ మాట్లాడారు. సీఎంహెచ్ఓ రాజారెడ్డి, వెటర్నరీ డాక్టర్ గోపాల్రావు, ఈఈ సంతోష్బాబు, ఏఈ రామన్న, శానిటరీ ఇన్స్పెక్టర్లు వెంకన్న, రవీందర్ పాల్గొన్నారు.
కదనరంగంలోకి జీడబ్ల్యూఎంసీ
కమిషనర్చాహత్ బాజ్పాయ్
తనిఖీలతో హాల్చల్.. అధికారులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు