
పైకప్పు లేని మ్యాన్హోల్ కనిపించట్లేదా?
వరంగల్ అర్బన్: ‘పై కప్పు లేని మ్యాన్హోల్ కనిపింట్లేదా? ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు’ అని మేయర్ గుండు సుధారాణి శానిటేషన్ సిబ్బందిని మందలించారు. వరంగల్ ఎస్వీఎన్ రోడ్డు వెంకటేశ్వర ఆలయం వద్ద చిన్నపాటి వర్షానికే మోకాళ్ల లోతు నీళ్లు స్తంభించి వాహనదారులు, పాదచారులకు ఎదురవుతున్న ఇబ్బందులపై అందిన ఫిర్యాదుతో మేయర్ తనిఖీ చేశారు. పైకప్పులేని మ్యాన్ హోల్, పూడిక తీయని డ్రెయినేజీలను ఆమె పరిశీలించారు. పనితీరు మార్చుకోవాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. ప్రతీ రోజు డ్రెయినేజీలోని పూడిక తీయాలని, ఏమైనా సమస్య ఉంటే ఇంజనీర్లతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. కమర్షియల్ దుకాణాదారులు డ్రెయినేజీల్లో, ఆరు బయట చెత్త వేస్తే జరిమానాలు విధించాలన్నారు. ఈతనిఖీల్లో ఎంహెచ్ఓ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్ భాస్కర్ తదితరులు ఉన్నారు.
శానిటేషన్ సిబ్బందిని మందలించిన మేయర్ సుధారాణి