
మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
వరంగల్ పోలీస్ కమిషనరేట్లో
పోస్టింగ్లకు పోటాపోటీ
● ప్రజాప్రతినిధులనుంచి
లేఖలు, సిఫార్సులు
● లూప్లైన్లో ఎంట్రీ..
ఎస్హెచ్ఓగా కీలక
ఠాణాలపై కన్ను
● పైరవీలు, సిఫార్సు
లేఖలపై పోలీస్
ఉన్నతాధికారి సీరియస్?
● పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా
బదిలీలు, పోస్టింగులు
గ్రేటర్ వరంగల్లోని కీలక ఠాణాల కోసం పైరవీలు, లేఖల సిఫారసులు ఉన్నతాధికారులకు తెప్పిస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసి ఆరోపణలు, వివాదాస్పదంగా ఉన్న పలువురు ఇన్స్పెక్టర్లు ఇతర జిల్లాలకు వివిధ పోస్టింగ్లలో భాగంగా వెళ్లారు. పరిస్థితులు అనుకూలంగా మారడంతో తిరిగి మళ్లీ ఏదో ఒక కారణం.. పైరవీతో కమిషనరేట్లో ఎంటర్ అవుతున్నారు. వచ్చిరాగానే కీలక ఠాణాలు ఎంపిక చేసుకుని పావులు కదుపుతుండటంతో పోలీస్ ఉన్నతాధికారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. డీసీఆర్బీ, పీసీఆర్, సీసీఎస్, టాస్క్ఫోర్స్ తదితర విభాగాల్లో ఉన్న కొందరు ఆ విభాగాలకు సంబంధించిన పనులు చేయకుండా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ లేఖలు, సిఫారసులు చేయించడం పట్ల పోలీసు ఉన్నతాధికారి చికాకు పడినట్లు తెలిసింది. చేసే పని సరిగా చేయకుండా పైరవీలు చేయించడాన్ని సీరియస్గా భావించిన సదరు అధికారి కొందరిని గట్టిగానే మందలించారన్న వార్త పోలీసు సర్కిళ్లలో వైరల్గా మారింది.
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్
పోలీస్ కమిషనరేట్లో ‘లేఖ’ల పంచాయితీ నడుస్తోంది. ప్రధానంగా వరంగల్ నగర పోస్టింగ్ల ప్రయత్నాలు మామూలుగా లేవు. నగరానికి దూరంగా, లూప్లైన్లో ఉన్న కొందరి కుర్చీల పరుగు సహచర పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పోటాపోటీగా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఒక దశలో ఇటు రాజకీయ నాయకులు, అటు పోలీస్ ఉన్నతాధికారులకు చికాకు తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టింగ్ పట్టడమే కాదు తెచ్చుకున్న స్థానాన్ని కాపాడుకునేందుకు కొందరు పోలీస్ ఇన్స్పెక్టర్లు పడరాని పాట్లు పడుతున్నారు. మరికొందరైతే బదిలీలకు కొద్ది రోజుల ముందు కమిషనరేట్లో ఎంటరై లూప్లైన్ సీటు సంపాదించి.. ఆ వెంటనే ఆ పనిచేయకుండా స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోస్టింగ్ల కోసం పావులు కదుపుతున్నారు. ఎక్కడ ఎవరూ ఏం మిస్టేక్ చేస్తారా? అని మరీ లేఖలు తీసుకుని కాచుకు కూర్చుంటున్నారు. దీంతో ఠాణాలలో ఎస్హెచ్ఓలుగా పనిచేసే పలువురు అభద్రతాభావానికి గురవుతున్నారన్న చర్చ ఆ శాఖలో ప్రస్తుతం హాట్టాపిక్గా ఉంది.
పోలీసుల పోస్టింగ్లపై ‘అఽధికార’ మార్కు..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పలువురు పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఏసీపీల బదిలీ వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ మార్కు ఉందన్న చర్చ ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునుంచే ఇక్కడ పోస్టింగ్ల కోసం పోటాపోటీగా పావులు కదుపుకుంటున్నారన్న చర్చ ఉంది.. ఒక ఇన్స్పెక్టర్ (ఎస్హెచ్ఓ) పదవీకాలం ఏడాదిన్నరైనా పూర్తికాక ముందే ఆ పోస్టింగ్లు కొట్టేందుకు వారి సహచరులే ప్రజాప్రతినిధులను కాకా పట్టిన వైనం అప్పట్లో బహిరంగంగానే మాట్లాడుకున్నారు. కాగా, ఈ పోస్టింగ్ల ప్రయత్నాల్లో గత ప్రభుత్వం హయాంలో పనిచేసిన కొందరు దూరంగా ఉంటుండగా.. మరికొందరు ఇప్పటికీ కీలక పోస్టింగ్లు పొందుతున్నారు. కోరుకున్న చోట కొ లువు చేయాలనుకునే కొందరు సీఐలు ఆ ఠాణాల్లో ఖర్చీఫ్ (లేఖ)లు వేసుకుని పోస్టింగ్లపైనే దృష్టిపెట్టడం వల్ల వారు పనిచేస్తున్న విభాగాల్లో పనులు పెండింగ్ పడుతున్నాయి. వీటికి కారణాలేమైనా.. బదిలీలు, పోస్టింగ్లు జరిగినప్పుడల్లా ఆ అంశంపై పోలీస్శాఖలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా కీలక ఠాణాలు, సర్కిళ్లలో పోస్టింగ్ల కోసం సీఐల మధ్య ‘కుర్చీలాట’ సాగడం.. గత ఆరు నెలల వ్యవధిలో జరిగిన బదిలీల సందర్భంగా చాలామందికి స్థానచలనం కలగడం, తిరిగి మళ్లీ పోస్టింగ్లు పొందడం హాట్టాపిక్ అవుతోంది.
న్యూస్రీల్
చికాకు తెప్పిస్తున్న పైరవీలు, లేఖలు

మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025