
నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం
కొండా దంపతులపై టీపీసీసీ చీఫ్కు ఫిర్యాదు
వరంగల్: పార్టీని నమ్ముకున్న తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా కొండా సురేఖ దంపతులు అన్యాయం చేస్తున్నారని వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్కు ఏకరువు పెట్టారు. సోమవారం తూర్పు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నేతృత్వంలో హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈసందర్భంగా పలువురు ఆయనతో మాట్లాడుతూ.. కాంగ్రెస్లోని సీనియర్లను కాదని గత ఎన్నికల్లో, గెలిచిన తర్వాత పార్టీలో వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వివరించారు. ఈవిషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారిపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల భద్రకాళీ దేవాలయ ట్రస్ట్బోర్డులో సైతం గెలిచిన తర్వాత వచ్చిన వారికి అవకాశం కల్పించారే తప్ప సీనియర్లను విస్మరించారని ఫిర్యాదు చేశారు. కాగా.. ‘తప్పకుండా పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశాలు కల్పిస్తాం’ అని మహేష్కుమార్గౌడ్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంటల రాజు, మాజీ కార్పొరేటర్లు జన్ను అరుణ్, దూపం సంపత్, బిల్ల శ్రీకాంత్, జన్ను రవి, కరాటే ప్రభాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరిమి పరమేశ్, అర్బన్ అధ్యక్షుడు సలీం, వరుణ్, లింగమూర్తి, రవి, లక్ష్మణ్, బాలరాజు, కొమురయ్య, చిరంజీవి, దామోదర్, తిరుపతి పాల్గొన్నారు.

నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం