
కమిషనర్ బిజీబిజీ
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ నూతన కమిషనర్గా తాజాగా బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్పాయ్ సోమవారం రోజంతా బిజీబిజీగా గడిపారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను, జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్న్స్ జడ్జి డాక్టర్ కె.పట్టాభి రామారావును, వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్న్స్ జడ్జి వీబీ.నిర్మలా గీతాంబను వారి కార్యాలయాల్లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం వరంగల్ నగరంలో మంత్రి సురేఖ క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణిని జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కలిసి పూల మొక్క బహూకరించారు. కొద్దిసేపు బల్దియా పరిపాలనా వ్యవహారాలపై చర్చించుకున్నారు. తదుపరి గ్రీవెన్స్ సెల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గ్రీవెన్స్ సెల్ దరఖాస్తుల పరిష్కారం సిటిజన్ చార్టర్ అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. బల్దియా ఆవరణలో కొనసాగుతున్న కౌన్సిల్ హాల్ ఆధునికీరణను మేయర్తో కలిసి పర్యవేక్షించారు. త్వరగా అందుబాటులోకి తీసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. బల్దియా వింగ్ అధికారులు, జేఏసీ నాయకులు, వివిధ విభాగాల అధికారులు సిబ్బంది కమిషనర్కు పూల మొక్కలు, బోకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరిక లేకుండా గడిపారు.

కమిషనర్ బిజీబిజీ