
1886లో నిజాం కాలంలో నిర్మాణం..
ప్రస్తుతం మరమ్మతులు పూర్తి చేసుకున్న ఈ కలెక్టర్ క్యాంపు కార్యాలయం 1886లో అప్పటి నిజాం అధికారి జార్జి పామర్రు సారథ్యంలో నిర్మించారు. ఈ భవనం వయస్సు దాదాపు 138 సంవత్సరాలు పై మాటే. ఈ భవనంలో దాదాపు 40 మందికి పైగా కలెక్టర్లు నివాసం ఉన్నారు. కలెక్టర్ బంగ్లా కొత్తది నిర్మించడంతో పాత బంగ్లాను హెరిటేజ్ భవనంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రస్తుతం బదిలీ అయిన కలెక్టర్ ప్రావీణ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని మరమ్మతులు చేయించారు.
దెయ్యం.. భయం
గతంలో ఉన్న కలెక్టర్లలో కొందరు ఈ భవనంలో తాము స్వయంగా దెయ్యం అనుభవాలు చవిచూశామని చెప్పడం అప్పట్లో కొంత చర్చనీయాంశమైంది. అయినప్పటికీ ఈ భవనానికి రాకపోకలు, అధికారులు నివాసం ఉండడం యథావిధిగా సాగాయి. ప్రస్తుతం ఈ భవనం అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలు సందర్శించే అవకాశం కలుగుతుంది.