
నీట్ ర్యాంకర్ల ‘ఎయిమ్స్’
గుంటూరు ఎడ్యుకేషన్ : వైద్య విద్యా కోర్సుల జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్–2025)లో గుంటూరుకు చెందిన పలువురు విద్యార్థుల వివిధ కేటగిరీల్లో అఖిల భారతస్థాయిలో ర్యాంకులు కై వసం చేసుకున్నారు.
నీట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు జాతీయస్థాయి వైద్య విద్యా సంస్థల్లో (ఎయిమ్స్)తో పాటు దేశంలోని ప్రముఖ వైద్య కళాశాలల్లో సీట్లు సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు.
ఎయిమ్స్లో చేరడమే లక్ష్యం
స్వస్థలం యర్రగొండపాలెం. నాన్న యేసానాయక్ జెడ్పీ హైస్కూల్ గణితశాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. టెన్త్ వరకూ నవోదయలో, ఇంటర్మీడియెట్ గుంటూరు వచ్చి చదివాను. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 981మార్కులు సాధించాను. తాజా ర్యాంకుతో ఎయిమ్స్లో చేరాలని భావిస్తున్నాను.
– రమావత్ తరుణ్ కుమార్ నాయక్,
51వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీ
వైద్యురాలిగా
రాణించాలనే లక్ష్యం
స్వస్థలం నరసరావుపేట. నాన్న షేక్ మహబూబ్ సుభానీ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. ఓపెన్ కేటగిరీలో 1,184వ ర్యాంకు సాధించా. ఎయిమ్స్లో చేరే లక్ష్యంతో ఉన్నాను.
– షేక్ వసీమా, 80వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్
డాక్టర్గా సమాజానికి సేవ
స్వస్థలం గుంటూరు. నాన్న రత్నాకర్ ఆర్కిటెక్చర్. అమ్మ రెబెకా విద్య సివిల్ ఇంజినీర్. గతేడాది నీట్లో క్వాలిఫై అయ్యి పుదుచ్చేరిలోని జిప్మర్లో సీటు సాధించిన అన్నయ్య ప్రణయ్ విక్టర్ బాటలో వైద్య విద్య అభ్యసించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. ఎయిమ్స్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత కార్డియాలజిస్ట్గా ఎదిగి, సమాజానికి సేవ చేస్తా. – సోలే ప్రేమ్ జడ్సన్ ప్రసన్న,
108వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీ
గైనకాలజిస్ట్గా సేవలందిస్తా!
స్వస్థలం నెల్లూరు. నాన్న కృష్ణారెడ్డి వ్యవసాయం చేస్తున్నారు. వైద్య విద్యపై మక్కువతో రోజుకు 15 గంటల పాటు చదివాను. ప్రణాళికాబద్ధమైన కృషితోనే ఓపెన్ కేటగిరిలో 960 ర్యాంకు సాధ్యమైంది. ఎయిమ్స్లో వైద్యవిద్య అభ్యశించిన తరువాత గైనకాలజిస్ట్గా రాణించాలనే లక్ష్యంతో ఉన్నా.
– నాగిరెడ్డి మనస్విని,
49వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్
జాతీయస్థాయి వైద్య విద్యాసంస్థల్లో సీటు సాధనే లక్ష్యం వివిధ కేటగిరీల్లో ప్రతిభ చాటిన విద్యార్థుల భావి ప్రణాళికలు

నీట్ ర్యాంకర్ల ‘ఎయిమ్స్’

నీట్ ర్యాంకర్ల ‘ఎయిమ్స్’