
13 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
చేబ్రోలు: రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన సంఘటన ఆదివారం జరిగింది. చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెంలోని ముట్లూరు రోడ్డులో రేషన్ బియ్యం నిల్వ చేసి, రవాణా చేయడానికి సిద్ధమవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ డి. వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఆటోలో ఉన్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ధీనం చేసుకొని మస్తాన్వలిపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు గత కొంతకాలంగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.