కూటమి టెండర్‌ | - | Sakshi
Sakshi News home page

కూటమి టెండర్‌

Jun 16 2025 5:47 AM | Updated on Jun 16 2025 5:47 AM

కూటమి

కూటమి టెండర్‌

గుంటూరు

ఘనంగా తిరునాళ్ల మహోత్సవం

నగరం: మండలంలోని ఈదుపల్లి గ్రామదేవత ఈదులమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఆదివారం ౖనిర్వహించారు. గ్రామోత్సవం అనంతరం అమ్మవారిని ఆలయంలో పునఃప్రవేశపెట్టారు.

బగళాముఖికి విశేష పూజలు

చందోలు(కర్లపాలెం): చందోలులోని

బగళాముఖి అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణ చేసి పసుపు, కుంకుమలు సమర్పించారు.

ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన

నాదెండ్ల: గణపవరం కోదండరామాలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి జరిగిన కోలాటం ఆకట్టుకుంది. మాస్టర్‌ వెంకటరెడ్డిని సత్కరించారు.

సోమవారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల టెండరింగ్‌ ప్రక్రియలో కూటమి నేతలు హవా కొనసాగిస్తున్నారు. ఎవరు పడితే వారు పాల్గొనడానికి వీల్లేదు. ఒక వేళ ఎవరైనా టెండర్‌ ప్రక్రియలో పాల్గొని దక్కించుకుంటే దాన్ని ఓపెన్‌ కానివ్వకుండా చేస్తామని బాహాటంగానే బెదిరిస్తున్నారు. మూడు రోజుల నుంచి కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ నాయకులు సమావేశాల మీద సమావేశాలు ఏర్పాటు చేసి, వర్కులు పంచుకునే పనిలో నిమగ్నమయ్యారు.

పంచుకో...దోచుకో !

ఈ నెల 18వ తేదీ నుంచి 269 వర్కులకు టెండర్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాధారణంగా దేశవ్యాప్తంగా ఎక్కడైనుంచైనా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. నగరపాలక సంస్థ కేటాయించిన ఒక వర్కుకి రూ.50లక్షలతో టెండర్‌ కాల్‌ ఫర్‌ చేస్తే కాంట్రాక్టర్లు 10 నుంచి 12శాతం లెస్‌కు పాడుకుని దక్కించుకుంటుంటారు. దీని ద్వారా కార్పొరేషన్‌కు ఆదాయం సమకూరుతుంది. అయితే, దీన్ని కూటమి నేతలు అడ్టుకున్నారు. తమ పార్టీ నాయకులే చేయాలని మూడు రోజుల నుంచి కిందట జరిగిన కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ నాయకుల సమావేశంలో తీర్మానించారు. పది వార్డుల్లో పూర్తిగా తామే చేస్తామని, మిగిలిన 47 వార్డుల్లో 20 శాతం కూడా తామే చేస్తామని, మిగిలిన 80 శాతం వర్కులను పంచిపెడతాం అంటూ అధికార పార్టీ నేత హుకుం జారీ చేశారు. అప్పటి వరకు ఈ– ప్రొక్యూర్మెంట్‌ కీ(టెండర్‌ ప్రక్రియలో పాల్గొనే ప్రతి కాంట్రాక్టర్‌కు ఒక కీ ఉంటుంది..దాని సాయంతో టెండర్‌లో పాల్గొంటారు) ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాడు. దీన్ని కొంతమంది కాంట్రాక్టర్లు వ్యతిరేకించారు. దీంతో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగారు. ఒక వేళ టెండర్‌లో పాల్గొన్నప్పటికీ ఓపెన్‌ కానివ్వకుండా చేస్తాం.. వర్క్‌ అయిన తరువాత బిల్లు ప్రాసెస్‌ కాకుండా చేస్తామంటూ అడ్డు చెప్పారు. తమకు మేయర్‌ అండదండలు ఉన్నాయంటూ బహిరంగంగా చెప్పడంతో కొంత మంది కాంట్రాక్టర్లు వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

టీడీపీ వర్సెస్‌ జనసేన

మేయర్‌ అండదండలున్న కాంట్రాక్టర్లు పెట్టిన ప్రతిపాదనలను కొంత మంది జనసేన పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు వ్యతిరేకించినట్లు సమాచారం. ‘మీకు ఎంత ప్రాధాన్యత ఉందో మాకు అంతే ఉందని’ జనసేన పార్టీకి చెందిన ఓ కాంట్రాక్టర్‌ నిలదీస్తే టీడీపీ నేతలు ఇచ్చేది లేదని తెగేసి చెప్పినట్లు తెలిసింది. లాభాలు వచ్చే కాంట్రాక్టులు తెలుగుదేశం వారే ఉంచుకుని తక్కువ లాభాలు వచ్చేవి తమకు షేరింగ్‌ ఇస్తారా అంటూ జనసేన నేతలు ప్రశ్నించినట్లు సమాచారం. నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కే విధంగా జరుగుతున్న ఈ టెండర్‌ ప్రక్రియను మెజారిటీ కాంట్రాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. అయితే, దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగుతారా? లేకపోతే నిబంధనలకు కట్టుబడి కార్పొరేషన్‌ ఆదాయాన్ని పరిరక్షిస్తారో చూడాల్సి ఉంది.

అధికారులపై ఒత్తిడి

7

న్యూస్‌రీల్‌

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల టెండరింగ్‌ ప్రక్రియలో పచ్చ నేతలు పెత్తనం కొనసాగిస్తున్నారు. చివరకు నగరంలో జరిగే చిన్న పనులను కూడా వారే చేస్తున్నారు. బయట వారు వస్తే అవరోధాలు సృష్టిస్తున్నారు. అసలు టెండర్లను తెరవకుండా కుయుక్తులు పన్నుతున్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు కూడా గంగిరెద్దుల్లా తలలూపుతూ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.

నగరపాలక సంస్థ టెండర్లలో

అధికార పార్టీ నాయకుల హవా

ఈనెల 18 నుంచి 269 వర్కులకు

టెండర్లు పిలవనున్న కార్పొరేషన్‌

ఇప్పటికే వర్కులను పంచుకున్న

బడా కాంట్రాక్టర్లు

వ్యతిరేకిస్తున్న చోటా కాంట్రాక్టర్లు

మేయర్‌ పేరు చెప్పి బెదిరింపులు

గత నెల ఎనిమిదో తేదీన వందల వర్కులకు టెండర్లు ఓపెన్‌ చేయాల్సి ఉంది. అయితే, కూటమి నేతలు కాకుండా వేరే వారు ఉన్నారని, ఎలాగైనా ఆపాలని టీడీపీ ప్రజాప్రతినిధులు డ్రాయింగ్‌ బ్రాంచ్‌ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. టెండర్‌ కాల్‌ ఫర్‌ చేసిన కొద్ది రోజుల్లోనే ఓపెన్‌ చేయాలనే నిబంధన ఉంది. ఈ మేరకు డ్రాయింగ్‌ బ్రాంచ్‌లో పనిచేసే అధికారి 20 రోజుల తరువాత టెండర్‌ ఓపెన్‌ చేశారు. దీనిని వ్యతిరేకించిన కొంత మంది బడా కాంట్రాక్టర్లు, అధికారులను అడ్డంపెట్టుకుని టెండర్లన్నింటిని రద్దు చేయించారు. జీఎస్టీ క్లియరెన్స్‌ లేకుండా ఏ విధంగా ఓపెన్‌ చేశావంటూ ఆయన్ను మాతృశాఖకు సరెండర్‌ చేయించారు. ఇందులోనే టీటీడీ వార్డు అధ్యక్షుడు రెండు వర్కులు వేస్తే, వాటిని కూడా రద్దు చేయించడంపై ఆయన కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

కూటమి టెండర్‌1
1/5

కూటమి టెండర్‌

కూటమి టెండర్‌2
2/5

కూటమి టెండర్‌

కూటమి టెండర్‌3
3/5

కూటమి టెండర్‌

కూటమి టెండర్‌4
4/5

కూటమి టెండర్‌

కూటమి టెండర్‌5
5/5

కూటమి టెండర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement