అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు | YSRCP Ambati Sensational Comments On Jagan Tours | Sakshi
Sakshi News home page

అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

Jun 16 2025 3:20 PM | Updated on Jun 16 2025 5:21 PM

YSRCP Ambati Sensational Comments On Jagan Tours

సాక్షి, గుంటూరు: చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు ఇక భయపడేదని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ పర్యటనల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హాట్‌ కామెంట్స్‌ చేశారాయన. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ..

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 18వ తేదీన రెంటపాళ్ల పర్యటనకు ఆటంకాలు కలిగిస్తోంది. జనాలను పంపి హింసకు ప్రేరేపించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు.   ఈ క్రమంలోనే.. అనుమతి పేరిట విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారు.  

రెంటపాళ్లలో వైఎస్సార్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అతని కుటుంబ సభ్యుల పరామర్శకు జగన్ వెళ్తుంటే.. ప్రభుత్వం పిచ్చి చేష్టలకు దిగుతోంది.   చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబాన్ని పరార్శించడానికే జగన్ వెళ్తున్నారు. తమ కార్యకర్త చనిపోతే.. పార్టీ అధినేత పరామర్శించటం తప్పా?. మేమేమీ బహిరంగ సభలకు వెళ్లటం లేదు. కానీ పోలీసుల వ్యవహారశైలి చూస్తుంటే జగన్ అసలు బయటకు రావటానికి వీల్లేదన్నట్టుగా ఉంది. 

జగన్ గుంటూరు పర్యటనపై నారా లోకేష్ కుట్ర..

పొదిలిలో కూడా రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. అంతేకానీ జగన్‌ను పర్యటించొద్దని అనడం కరెక్టు కాదు. జగన్ పర్యటనలో హింస సృష్టించేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అధికారం ఉందని అతిగా ప్రవర్తించద్దని ఆ తండ్రీకొడుకులకు చెప్తున్నాం. జనాన్ని పెట్టి కోడిగుడ్లు, టమోటాలు వేయించాలనుకోవటం దారుణం. జనాన్ని అణచి వేయాలనుకుంటే కుదరదు. చంద్రబాబు హెచ్చరికలు ఏపాటివో మా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. ఆయన రాజకీయాలను చూసి మేము భయపడేది లేదు’’ అని అంబటి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement