కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఏం జరిగింది? | Mahabharata Questions And Answers | Sakshi
Sakshi News home page

పాండవులు సొరంగము తవ్వే వానికి ఏం చెప్పారు?

Nov 24 2020 7:27 AM | Updated on Nov 24 2020 7:27 AM

Mahabharata Questions And Answers - Sakshi

58. పురోచనుడు తన భార్యను ఎవరి దగ్గర నియోగించాడు?
59. ఆమె చేయవలసిన పని ఏమిటి?
60. కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఏం జరిగింది?
61. ఉత్సవం ముగిశాక ఏం జరిగింది?
62. పురోచనుడు ఎక్కడ నిద్రించాడు?
63. అర్ధరాత్రి సమయంలో ఏం జరిగింది?
64. పాండవులు సొరంగము తవ్వే వానికి ఏం చెప్పారు?
65. పాండవులు ఏం చేశారు?

జవాబులు
58. కుంతి దగ్గర; 59. నిత్యం కుంతి రహస్యాలను పురోచనుడికి తెలియపరచాలి. ఆమె అలాగే చేసేది; 60. ఆ రోజు రాత్రి లక్క ఇంటిలో పాండవులు గొప్ప ఉత్సవం చేశారు. నిషాద స్త్రీ, ఆమె ఐదుగురు కొడుకులు కల్లు తాగారు. తెలివి తప్పి పడిపోయారు. లక్క ఇంటి పక్కనే నిద్రించారు; 61.  ఉత్సవం ముగిసింది. అర్ధరాత్రి అయ్యింది. అందరూ నిద్రించారు; 62. ఆయుధాగారంలో నిద్రించాడు; 63. ధర్మరాజు సమయం చూశాడు. భీముడికి అనుమతి ఇచ్చాడు. భీముడు నిప్పు అందుకుని, ఆయుధాగారపు ద్వారానికి నిప్పు అంటించాడు. భగ్గున మండింది. పురోచనుడు ఆ మంటల్లో మరణించాడు; 64. వారి కుశలం తెలిపారు. విదురునికి తెలియపరచమన్నారు; 65. బిలంలోకి ప్రవేశించారు.   –నిర్వహణ: వైజయంతి పురాణపండ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement