అంగన్‌వాడీల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల పోరుబాట

Jul 10 2026 5:34 AM | Updated on Jul 10 2026 5:34 AM

అంగన్‌వాడీల పోరుబాట

నేడు ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

ఏలూరు (టూటౌన్‌): తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీలు మరోసారి పోరుబాట పట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ నెల 10న ఏలూరు కలెక్టరేట్‌ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

● సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అంగన్‌వాడీలకు రూ.26 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ సౌకర్యాలు కల్పించాలి.

● అంగన్‌వాడీల వేతనాలను పీఆర్సీకి అనుసంధానం చేయడంతో పాటు, గుజరాత్‌ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా జీతాలు పెంచాలి.

● మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి. హెల్పర్ల ప్రమోషన్‌కు 5 ఏళ్ల సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలి.

● అంగన్‌వాడీలకు ‘తల్లికి వందనం’ సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి.

● సిగ్నల్‌ సమస్యలతో తీవ్ర ఇబ్బంది పెడుతున్న ముఖ గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) ఫేస్‌ యాప్‌ను, పనిభారం పెంచే నవచేతన యాప్‌ను తక్షణమే రద్దు చేయాలి. పెండింగ్‌లో ఉన్న టీఏ, మెయింటినెన్స్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement