రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం

Jun 14 2026 7:04 AM | Updated on Jun 14 2026 7:04 AM

రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం

భీమడోలు: జాతీయ రహదారి పూళ్ల, భీమడోలు రైల్వే స్టేషన్ల మధ్య గల అండర్‌ పాస్‌ సమీపాన శనివారం ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. మృతుని శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని రైలు ఢీకొనడం లేదా రైలు నుంచి జారిపడడంతో మృతదేహాం నుజ్జునుజ్జుగా మారిందని రైల్వే పోలీసులు తెలిపారు. వృద్ధుని వయస్సు 60 నుంచి 70 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎత్తు 5.5 అడుగులు, ఛామనఛాయ, నలుపురంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గూడెం స్టేషన్‌ మాస్టార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement