ఉంగుటూరు మండలంలోని రాచూరు వద్ద టిప్పరు లారీ తిరగపడి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మోటారు సైక్లిస్టును తప్పించబోయి టిప్పర్ తిరగబడింది. 8లో u
సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల పాలిట గొడ్డలి పెట్టు లాంటిది. టెట్ నిబంధనను అధిగమించడానికి పార్లమెంట్లో చట్టసవరణ చేస్తేనే మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలోని నిబంధనలను సవరించడం ద్వారా ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించవచ్చు. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను కేవలం టెట్ పరీక్షలతో కొలవలేము.
– గెడ్డం సుధీర్, వైఎస్ఆర్ టీచర్స్
అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి.
ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ అర్హత సాధించాలనడం ఎంతమాత్రం సహేతుకం కాదు. దాదాపు 20 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారు ఇప్పటికిప్పుడు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? కొన్ని అర్హతా ప్రమాణాల మేరకు అప్పట్లోనే ఉద్యోగాలు పొందిన వారికి, దశాబ్దాల తర్వాత మరోసారి అర్హత పరీక్షలు నిర్వహించి తీరాలనడం ప్రపంచంలో ఎక్కడా లేదు.
– పువ్వుల ఆంజనేయులు,
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు.


