ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందేలా యోగాంధ్ర– 2026 కార్యక్రమాన్ని నిర్వహించా లని జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ సంసిద్ధతపై దిశానిర్దేశం చేశారు. సంబంధిత శాఖల అధికారులతో శనివారం సాయంత్రం జేసీ టెలి కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాస్టర్ ట్రైనర్లు, ట్రైనర్ల నమోదు కార్యక్రమాన్ని వెంటనే పూర్తిచేసి, 7 నుంచి ప్రజలకు శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యోగాంధ్ర –2026 థీమ్పై రూపొందించిన బ్యానర్ను కార్యక్రమంలో తప్పక ప్రదర్శించాలన్నారు. యోగా ఆవశ్యకత, ఆరోగ్య ప్రయోజనాలపై జూనియర్స్ కేటగిరిలో విద్యార్థులకు ఈ నెల 7, 8, 9 తేదీలలో గ్రామ స్థాయిలో వివిధ విభాగాలలో పోటీల నిర్వహించాలని, పోటీలలో పాల్గొనే వారు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు కావాలన్నారు. జిల్లాలో 191 మంది మాస్టర్ ట్రైనర్లు నమోదు అయ్యారని, వారితో మండల, గ్రామ స్థాయిలో ట్రైనర్లకు శిక్షణ అందించాలన్నారు.


