
ఎఫెక్ట్
తల్లికి వందనంపై స్పందించిన అధికారులు
కామవరపుకోట: కరెంట్ బిల్లు సాకుతో ‘తల్లికి వందనం ఎగనామం’ పేరిట సాక్షి దినపత్రికలో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. స్థానిక కొత్తూరు యానాదుల కాలనీకి చెందిన చౌటూరి కోటమ్మ ఇద్దరు పిల్లలు తల్లికి వందనం పథకానికి అర్హులయినప్పటికీ ఆమెకు 300 యూనిట్లకు పైగా విద్యుత్ బిల్లు వచ్చినట్లు చూపించి అనర్హులుగా చూపించారు. దీంతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి కెఆర్పురం ఐటీడీఏ అధికారులు స్పందిస్తూ చౌటూరి కోటమ్మను అర్హురాలుగా ప్రకటించారు.
కూతురే కొడుకై ..
జంగారెడ్డిగూడెం: కూతురే కొడుకై తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన జంగారెడ్డిగూడెం పట్టణం బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలో జరిగింది. ఆదిమూలపు వెంకటేశ్వరరావు (55) అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందాడు. వెంకటేశ్వరరావుకు కొడుకులు లేరు. దీంతో కుమార్తె ముప్పన జ్యోతి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది.

ఎఫెక్ట్