రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Jun 21 2025 3:13 AM | Updated on Jun 21 2025 3:13 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

యలమంచిలి: పాలకొల్లు యడ్లబజారు సెంటర్‌లోని ఫైర్‌స్టేషన్‌ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యలమంచిలి మండలం కాజ పడమర గ్రామానికి చెందిన సత్తినీడి వీరన్న(69) మరణించారు. ఆయన కాజ పడమర నుంచి తన బైక్‌పై పాలకొల్లు వెళ్తుండగా యడ్లబజారు సెంటర్‌లో ఫైర్‌ స్టేషన్‌ వద్దకు వచ్చాక వెనుకగా లారీ బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో అతని బైక్‌ లారీ ముందు భాగంలోకి దూసుకుపోయింది. లారీ బైక్‌తోపాటు వీరన్నను కొద్ది దూరం ఈడ్చుకుపోయింది. దీంతో ఆయన ప్రమాద స్థలంలోనే మరణించారు. స్థానికులు 108 వాహనానికి ఫోన్‌ చేయడంతో వాహన సిబ్బంది వచ్చి వీరన్నను పరీక్షించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. మృతుడి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాలకొల్లు పట్టణ ఏఎస్సై శలా మార్లింగం కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement