
ఈ శ్రమ్ పోర్టల్పై వర్కర్లకు అవగాహన
ఏలూరు (టూటౌన్): జిల్లాలోని గిగ్ వర్కర్లు, ఫ్లాట్ ఫారం వర్కర్లు తప్పనిసరిగా ఈ–శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్ఆర్పేటలోని ఓ హోటల్లో గిగ్ వర్కర్లు, ఫ్లాట్ ఫారం వర్కర్లు, హోటల్ యాజమాన్యానికి ఈ–శ్రమ్ పోర్టల్ గురించి మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల నందు సుమారు 800 మంది వరకు గిగ్, ఫ్లాట్ ఫారం వర్కర్లు జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబర్, రాపిడ్ వంటి వాటిలో పనిచేసేవారు ఉన్నారన్నారు. వీరందరినీ ఈ–శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. వర్కర్లు ఆధార్ నంబర్, పాన్ నంబర్, ఆధార్కు అనుసంధానమైన ఫోన్ నెంబర్ కలిగి ఉండాలన్నారు. కార్మికుల వయసు 16 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. ఈ నమోదు ప్రక్రియ సెల్ఫ్ రిజిస్ట్రేషన్, సీఎస్సీ సెంటర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసుకోవచ్చునని ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ తెలియజేశారు.