
చేపలొచ్చాయోచ్..
ఫ వేటకు వెళ్లిన తొలిరోజు బోణీ అదుర్స్
ఫ మత్స్యకారుల వలలకు భారీ చేపలు
కాకినాడ రూరల్: సముద్రంలో వేట నిషేధం ముగిసింది. దీంతో శనివారం అర్ధరాత్రి నుంచి మత్స్యకారులు బోట్లతో వేటకు వెళ్లారు. కొందరు మత్స్యకారులు ఆదివారం ఉదయమే వేట ముగించుకుని రాగా, వారి వలలకు భారీ సైజు చేపలు చిక్కాయి. కాకినాడ కుంభాభిషేకం రేవు వద్దకు భారీ కొమ్ము కోనం చేపను బోట్ నుంచి క్రేన్ సహాయంతో అమ్మకానికి తీసుకువచ్చారు. దీని బరువు సుమారు 350 కిలోలు ఉంటుందని అంచనా. దీని ధర రూ.37 వేలు పలికింది. కొందరు మత్స్యకారులకు పెద్ద సైజు గుమ్మడి పార చేపలు చిక్కాయి. సుమారు 25 కిలో బరువున్న చేపను మత్స్యకారులు తీసుకురావడంతో అంతా ఆసక్తిగా తిలకించారు. కోనసీమ జిల్లాకు చెందిన వ్యాపారి కిలో సుమారు రూ.250 పైబడి ధరతో దీనికి కొనుగోలు చేశారు. వాతావరణం బాగోక చేపలు పడడం లేదని, అన్ని బోట్లు వేటకు వెళ్లలేదని మత్స్యకారులు చెబుతున్నారు. మరోవైపు కాకినాడ జగన్నాథపురం ఏటమొగ వద్ద మోటరైజ్డ్ బోట్లు (సోనా) ఆదివారం గంగమ్మ తల్లికి పూజల అనంతరం రాత్రికి వేటకు పయనమయ్యాయి.

చేపలొచ్చాయోచ్..