
పెద్దాపురంలో వ్యక్తి దారుణ హత్య
పెద్దాపురం: పట్టణ శివారు కట్టమూరు పుంత ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామానికి చెందిన జానకి సత్య శ్రీనివాస్ (వెంకన్నబాబు) (32)ను ఎవరో దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... మృతుడు ఓ రైస్మిల్లులో పని చేస్తున్నాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. పదునైన ఆయుధంతో మెడపై బలంగా కొట్టి చంపినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద పగిలిన బీర్ బాటిళ్లు ఉండడంతో వివాహేతర సంబంధమే హత్యకు కారణమా.? మద్యం మత్తులో ఎవరైనా హత్య చేశారా? మరే ఇతర కారణం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు శ్రీనివాస్పై గతంలో హత్య, హత్యాయత్నంతో సహా పలు కేసులు ఉన్నట్లు సమాచాఉరం. పెద్దాపురం పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఎస్ఐ మౌనిక తెలిపారు.