కన్నుల పండువగా సాహితి అరంగేట్రం | - | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా సాహితి అరంగేట్రం

Jun 17 2025 5:07 AM | Updated on Jun 17 2025 5:07 AM

కన్నుల పండువగా సాహితి అరంగేట్రం

కన్నుల పండువగా సాహితి అరంగేట్రం

గన్‌ఫౌండ్రీ: ప్రముఖ నాట్య శిక్షణాలయం జ్యోతి కళాక్షేత్రం స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో నృత్య గురువు జ్యోతిరెడ్డి శిష్యురాలు సాహితీ పద్మప్రియ కూచిపూడి నాట్య రంగ ప్రవేశం సోమవారం రవీంద్ర భారతిలో కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా పు ష్పాంజలి, జతిస్వరం, అలరింపు, వర్ణం, థిల్లాన వంటి అంశాలపై చక్కటి హావాభావాలతో సాగిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ఆనంద్‌ రాజేశ్వర్‌ బైవార్‌ మాట్లాడుతూ.. నేటి తరానికి శాసీ్త్ర య సంగీత కళలపై మక్కువ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ శాసీ్త్రయ కళలపై మక్కువ పెంచుకున్న సాహితి రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌వీ రెడ్డి, ఇన్‌కమ్‌ట్యాక్స్‌ (ఇన్వెస్టిగేషన్‌) ప్రైమరీ డైరెక్టర్‌ రాజ్‌గోపాల్‌ శర్మ తల్లిదండ్రులు మానస, ఐఆర్‌ఎస్‌ ఏపీ బాబు పాల్గొన్నారు.

కొట్లాటకు నిలయాలుగా

బ్రాందీషాపులు

కోరుకొండ: మండలంలోని బ్రాందీషాపులు కొట్లాటలు, ఘర్షణలకు నిలయాలుగా తయారయ్యాయి. తాజాగా ఆదివారం రాత్రి జరిగిన కొట్లాటలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. కోరుకొండ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జంభూపట్నం బ్రాందీషాపు వద్ద ఇద్దరు యువకులు గాయపడ్డారు. పశ్చిమగానుగూడెం గ్రామానికి చెందిన కాటుమళ్ల రాజశేఖర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తలపై బీరు సీసాలతో కొట్టారు. గాధరాడకు చెందిన చంద్రమళ్ల మహేష్‌ తలపై గుర్తుతెలియని వ్యక్తులు బీరుసీసాలతో మోదారు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సైనాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

0000648886-000001-Casual Advertis

10.00x8.00

Casual Advertisers

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement