
జేఈఈ అడ్వాన్స్డ్లో శ్రీషిర్డీసాయి విజయభేరి
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీషిర్డీసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించారని విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య సోమవారం తెలిపారు. తమ లక్ష్యా ఐఐటీ అకాడమీకి చెందిన ఐ.శ్రీసాయి హిమ్నీష్ జాతీయ స్థాయి 18వ ర్యాంకు సాధించగా, సీహెచ్ మోక్షిత్ 594, మోహన్ శ్రీరామ్జీ 685, మోహిత్ సత్యరాజ్ కిరణ్ 695 ర్యాంకులను కై వసం చేసుకున్నారన్నారు. మొత్తం నలుగురు విద్యార్థులు వెయ్యి లోపు ర్యాంకులు సాధించారన్నారు. 12 మంది మూడు వేల లోపు, 25 మంది ఐదువేల లోపు, 32 మంది పదివేలలోపు ర్యాంకులు సాధించారన్నారు. విద్యా సంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో ప్రముఖ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. విజేతలైన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని చై ర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్యా అకాడమీ డీన్ చంద్రశేఖర్ అభినందించారు.