ఉగాది పురస్కారాలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉగాది పురస్కారాలకు ఎంపిక

Mar 19 2026 7:37 AM | Updated on Mar 19 2026 7:37 AM

అమలాపురం టౌన్‌/కాట్రేనికోన/ముమ్మిడివరం/: ఉగాది సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రస్థాయి పురస్కారాలకు జిల్లాలోని పలువురు ఎంపికయ్యారు. విజయవాడలో గురువారం జరిగే ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు. పురస్కారానికి ఎంపికై న వారిలో అమలాపురానికి చెందిన సాహితీవేత్త, కవి, రచయిత నల్లా నరసింహమూర్తి, కాట్రేనికోన మండలానికి చెందిన చిత్ర కారుడు ఆకొండి అంజి, ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పి పెద్దిరెడ్డి వెంకట కృష్ణ మాధవరావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement