
జిల్లాలో సగటు వర్షపాతం 18.2 మిల్లీ మీటర్లు
అమలాపురం రూరల్: బంగాళాతంలో ఏర్పాడిన అల్పపీడనం వల్ల కోనసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి మొదలైన వర్షం గురువారం ఉదయం వరకు పడుతూ పలు చోట్ల భారీగా కురిసింది. 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకూ జిల్లా వ్యాప్తంగా 18 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కొత్తపేట మండలంలో అత్యధికంగా 46.1 మిల్లీ మీటర్లు, అంబాజీపేటలో అత్యల్పంగా 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మండలాల వారీగా..
అయినవిల్లి 36.2, ముమ్మిడివరం 30.4, కె.గంగవరం 30.2, పి.గన్నవరం 29.4, కపిలేశ్వరపురం 20.2, రామచంద్రపురం 21, ఆత్రేయపురం, మండపేటలలో 14.6, కాట్రేనికోన 14.4, అమలాపురం, ఆలమూరు, అల్లవరం, ఉప్పలగుప్తం 13.2 చొప్పున, రావులపాలెం 12.2, మామిడికుదురు, ఐ.పోలవరంలలో 12.4 చొప్పున, మలికిపురం 10.6, సఖినేటిపల్లి 10.4, రాజోలులో 10.2, రాయవరం 12 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
మాదకద్రవ్యాలకు
దూరంగా ఉందాం
అమలాపురం రూరల్: ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే సమాజం తిరోగమనంలో పయనిస్తోందని, అలాంటి చోట సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తి భవిష్యత్తును కుంగదీసే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం అనే నినాదంతో ‘మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ప్రాణాలను కాపాడుకుం దాం’ అనే నినాదంతో గురువారం కొంకాపల్లి సత్తెమ్మతల్లి గుడి నుంచి పేరూరు జంక్షన్ వరకు విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జేసీ నిశాంతి మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడటం సమాజానికి చాలా నష్టం కలిగిస్తుందన్నారు. ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమైన మత్తు పదార్థాల జాడ్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకూ పాకిందన్నారు. ఆర్డీఓ కె.మాధవి విద్యార్థులతో డ్రగ్స్ తీసుకోబోమని ప్రమాణం చేయించారు. డీఎస్పీ టీ.ఎస్ఆర్ కె.ప్రసాద్, డీఈవో షేక్ సలీం బాషా, డీఎంహెచ్ఓ దుర్గారావు దొర, ఐడీసీఎస్ పీడీ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో సగటు వర్షపాతం 18.2 మిల్లీ మీటర్లు