
గెయిల్ పైప్లైన్లపై నిరంతర పర్యవేక్షణ
జీఎం ముఖర్జీ
మామిడికుదురు: గెయిల్ పైప్లైన్లపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ ఎన్.ముఖర్జీ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ఇన్స్పెక్టర్ భూపేంద్రకుమార్ నేతృత్వంలో బృందం మంగళవారం నగరం గ్రామంలోని గెయిల్ టెర్మినల్ను సందర్శించింది. భద్రతా పరమైన చర్యలను టెర్మినల్ అధికారులు బృందానికి వివరించారు. ఏదైనా ప్రమాదాలు జరిగే సందర్భాల్లో వాటిని ఎదుర్కొనేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామన్నారు. పైప్లైన్లను నిత్యం తనిఖీ చేసే వ్యవస్థ తమకు అందుబాటులో ఉందన్నారు. పైప్లైన్ల నాణ్యతను బట్టి ప్రతి 20 నుంచి 25 ఏళ్లకు ఒకసారి కొత్త పైప్లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా లీకేజీలు, ప్రమాదాలు జరిగిన వెంటనే అది ఎక్కడ జరిగిందో క్షణాల్లో తమకు తెలిసేలా నగరం టెర్మినల్లోని అధునాతన వ్యవస్థ ద్వారా తమకు సమాచారం అందుతుందన్నారు. ఏదైనా ఘటనలు జరిగిన సందర్భంలో ప్రజలు తమకు సమాచారం అందించేలా ఎక్కడికక్కడ 15101 టోల్ ఫ్రీ నంబర్లను ప్రదర్శించినట్టు తెలిపారు. ఏదైనా సంఘటనలు జరిగిన సందర్భంలో తమ నుంచి ఏవిధమైన సహకారం కావాలో చెప్పాలని ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ భూపేంద్రసింగ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో పి.సునీల్కుమార్, గెయిల్ జీఎం పి.పోతయ్య, డీజీఎం బి.మహంతి, సీనియర్ మేనేజర్లు ఎస్.సుధీర్కుమార్, ఎస్.రామకృష్ణ, ఆర్ఐ ఇబ్రహీం, వీఆర్వోలు ఉన్నారు.