ధాన్యం బకాయిలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం బకాయిలు చెల్లించాలి

Jun 24 2025 3:51 AM | Updated on Jun 24 2025 3:51 AM

ధాన్యం బకాయిలు చెల్లించాలి

ధాన్యం బకాయిలు చెల్లించాలి

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు,

మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

రావులపాలెం: రాష్ట్రంలో రైతులకు 48 గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బు వారి ఖాతాల్లో వేస్తామని గొప్పలు చెప్పుకున్న కూటమి ప్రభుత్వం 48 రోజులు గడిచినా చెల్లించకుండా మోసం చేసిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు. జిల్లాలో తాము చేసిన నిరసన కార్యక్రమం ఫలితంగా ప్రభుత్వం జిల్లాలో రెండు లక్షల 66 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. దానికి గాను రూ.613 కోట్లు ఖర్చు అయిందన్నారు. దీనిలో ఇంకా రూ.248 కోట్లు రైతులకు బాకీ తీర్చాల్సి ఉందన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం జగ్గిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. తొలుత రెంటపాళ్ల జగన్‌ టూర్‌లో మృతిచెందిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త సింగయ్య మృతికి సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో జగన్‌పై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ఏ–1గా, హోం మంత్రిపై ఏ–2గాను, డీజీపీ పై ఏ–3 గా కేసులు పెట్టాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్‌ ప్రజల్లోకి వెళ్లకుండా ఆపడం కోసం ఆయనకు ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదన్నారు. పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబుపై ఎటువంటి కేసులు పెట్టాలన్నారు. రైతులకు పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలన్నారు. జగన్‌ హయాంలో రైతు భరోసా సాయగా రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మందికి ఇచ్చామన్నారు. రైతుకు పెట్టుబడి సొమ్ము వెంటనే అందేలా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యోగా దినోత్సవానికి రూ.300 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. గతంలో విజయవాడలో వరదలు వస్తే రూ.23 కోట్లు అగ్గిపెట్టెలకు ఖర్చు చేశారని, విపత్తును కూడా ప్రచారానికి, ఆదాయానికి అనుకూలంగా మార్చుకునే చంద్రబాబు లాంటి సీఎం రాష్ట్రానికి ఉండటం దురదృష్టం అన్నారు. లోకేష్‌ను జాకీతో లేపి రాష్ట్ర ప్రజలపై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. సీనియర్‌ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుందన్నారు. మంత్రి పదవి ఇస్తారని జగన్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి పక్కన పెట్టిన ప్రభుత్వాన్ని పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, దేవరపల్లి సర్పంచ్‌ దొమ్మేటి అర్జునరావు, రావులపాలెం ఉప సర్పంచ్‌ గొలుగూరి మునిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్‌, వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ నాయకుడు కప్పల శ్రీధర్‌, వార్డు సభ్యుడు సఖినేటి వాకుల్‌ రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement