సమాజానికి ఉపయోగపడేలా చదవాలి | - | Sakshi
Sakshi News home page

సమాజానికి ఉపయోగపడేలా చదవాలి

Jun 23 2025 5:52 AM | Updated on Jun 23 2025 5:52 AM

సమాజానికి ఉపయోగపడేలా చదవాలి

సమాజానికి ఉపయోగపడేలా చదవాలి

● యండమూరి వీరేంద్రనాథ్‌

బోట్‌క్లబ్‌ (కాకినాడ): చదువుకోవడం గొప్పకాదని, అది సమాజం, పెంచిన తల్లిదండ్రులకు ఉపయోగపడేలా ఉండాలని ప్రముఖ రచయిత, దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్‌ అన్నారు. స్థానిక ఫ్యాబిన్‌ కన్వెన్షన్‌ హాల్‌లో కై ట్‌ కళాశాల ఆధ్వర్యంలో ఏపీ ఎంసెట్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ ప్రస్తుతం చాలామంది ఇంజినీరింగ్‌ చదువుతున్నారని, ఉద్యోగం వచ్చిన మరుసటి రోజు నుంచి తల్లిదండ్రులను మరిచిపోయేలా వారి ప్రవర్తన ఉంటుందన్నారు. దీనివల్ల చదివిన చదువుకు అర్థం ఉండదని, రేపొద్దున్న ఇదే పరిస్థితి మనకూ వస్తుందని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. తల్లిదండ్రులు, గురువులు సమాజ మిత్రులని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కై ట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల చైర్మన్‌ పోతుల విశ్వం అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement