పురుగు మందు తాగి.. బస్సు కింద పడి | - | Sakshi
Sakshi News home page

పురుగు మందు తాగి.. బస్సు కింద పడి

Jun 23 2025 5:52 AM | Updated on Jun 23 2025 5:52 AM

పురుగు మందు తాగి.. బస్సు కింద పడి

పురుగు మందు తాగి.. బస్సు కింద పడి

ఫ యువకుడి బలవన్మరణం

కాకినాడ క్రైం: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తొలుత పురుగు మందు తాగి, ఆపై బస్సు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ మహాలక్ష్మి నగర్‌లోని రణదీప్‌నగర్‌కు చెందిన కుప్పాల కోదండ రామచంద్రమూర్తి (30) బీచ్‌ రోడ్‌లో ఉన్న ఓ ఆయిల్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతనికి వేట్లపాలేనికి చెందిన సిరితో రెండు నెలల కిందట వివాహమైంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రామచంద్రమూర్తి ఆదివారం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మార్గ మధ్యంలో పురుగు మందు కొని తాగాడు. టూ టౌన్‌ బ్రిడ్జి కింద తన ద్విచక్ర వాహనాన్ని ఉంచి తర్వాత బ్రిడ్జిపైకి వచ్చాడు. తర్వాత బస్టాండ్‌ నుంచి కోటిపల్లి వెళ్తున్న బస్సు కిందకు దూకాడు. బస్సు కొంతమేర లాక్కెళ్లిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. అతన్ని స్థానికులు కాకినాడ జీజీహెచ్‌లో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement