రెవెన్యూ శాఖ తల్లి లాంటిది | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ శాఖ తల్లి లాంటిది

Jun 21 2025 3:17 AM | Updated on Jun 21 2025 3:17 AM

రెవెన్యూ శాఖ తల్లి లాంటిది

రెవెన్యూ శాఖ తల్లి లాంటిది

అమలాపురం రూరల్‌: ప్రభుత్వ శాఖలన్నింటికీ రెవెన్యూ శాఖ తల్లి లాంటిదని, దీనికి 45 రకాల ప్రభుత్వ శాఖలతో నిత్యం అనుబంధం ఉంటుందని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం రెవెన్యూ దినోత్సవం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందు 1786 జూన్‌ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారని, 238 ఏళ్ల తర్వా త ఏపీలో రెవెన్యూ డే ప్రకటించారన్నారు. రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించామన్నారు. విశిష్ట సేవలందించిన 44 మంది ఉద్యోగులకు, కమాండేషన్‌ ఽధ్రువపత్రాలు మెమెంటోలు అందజేశారు. 18 మంది పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను సత్కరించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టీ నిషాంతి మాట్లాడుతూ రెవెన్యూ కేర్‌ పేరిట ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎస్‌డీజీ మమ్మీ, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, రెవెన్యూ శాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, తహసీల్దార్లు, వికాస జిల్లా మేనేజర్‌ రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కోనసీమ సెంటర్‌ ఫర్‌ మైగ్రేషన్‌ ద్వారా

68 కేసుల పరిష్కారం

కోనసీమ సెంటర్‌ ఫర్‌ మైగ్రేషన్‌ ద్వారా ఇప్పటి వరకు 68 కేసులను పరిష్కరించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. శుక్రవారం తన చాంబర్‌లో కోనసీమ సెంటర్‌ ఫర్‌ మైగ్రేషన్‌ కార్యాలయ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఉద్యోగ సంబంధిత కేసులు 16 , పాస్‌పోర్ట్‌ సంబంధిత కేసులు 3, విదేశాలకు వెళ్లి ఇబ్బంది పడినవారి కేసులు 7 పరిష్కరించామన్నారు. నోడల్‌ అధికారి డీఆర్వో రాజకుమారి, కోఆర్డినేటర్‌ జి. రమేస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement