రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Jun 18 2025 3:51 AM | Updated on Jun 18 2025 3:51 AM

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

తుని: అన్నవరం – రావికంపాడు రైల్వేస్టేషన్ల మధ్యలో రైలు నుంచి జారిపడి కొడకల వెంకట రమణ (30) అనే వ్యక్తి మృతి చెందాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం జల్లూరుకు చెందిన కొడకల వెంకటరమణ అనపర్తి మండలం పి.రామచంద్రాపురం కోళ్లఫారంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో సోమ వారం రాత్రి రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నానికి రైలులో బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలు కావడంతో 108లో తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వెంకటరమణకు భార్య, కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement