84 శాతం మందికి ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

84 శాతం మందికి ఉద్యోగాలు

Jun 15 2025 7:22 AM | Updated on Jun 15 2025 7:22 AM

84 శాతం మందికి ఉద్యోగాలు

84 శాతం మందికి ఉద్యోగాలు

అమలాపురం రూరల్‌: భట్లపాలెంలో బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం అచీవర్స్‌ డేను నిర్వహించారు. ఇందులో భాగంగా 2025 విద్యా సంవత్సరంలో చివరి సంవత్సరం విద్యార్థుల్లో 84 శాతం మంది ప్రముఖ బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందారని కళాశాల ప్లేస్‌మెంట్‌ అధికారి అడబాల కుమార్‌ తెలిపారు. విద్యా సంస్థల అధినేత బోనం కనకయ్య మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఆ విద్యార్థులకు చైర్మన్‌ బోనం కృష్ణ సతీష్‌, బోనం విజయలక్ష్మి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. క్రిటికల్‌ రివర్‌ సంస్థ సీనియర్‌ డైరెక్టర్‌, గ్లోబల్‌ హెడ్‌ జేపీ సోలమన్‌ దేవవరం విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీవీజీ రామారావు, రాజమహేంద్రవరం ప్రిన్సిపాల్‌ టీవీ జనార్దన్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ జక్కం కృష్ణారావు, శ్రీచలం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement