
గ్రామాలలో సమగ్రాభివృద్ధి
● జిల్లాలో గ్రామ సచివాలయాలు 198, రైతు భరోసా కేంద్రాలు 68, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు 35 భవనాలను నిర్మించారు.
● జిల్లాలో ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నాడు–నేడులో రూ.9.21 కోట్లతో
మంజూరయ్యాయి.
● గడపగడపకూ మన ప్రభుత్వంలో భాగంగా జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 515 సచివాలయాలలో ప్రభుత్వం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇందుకుగాను 1,102 పనులకు రూ.72.88 కోట్ల నిధులు ఖర్చు చేశారు.
● గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికీ కుళాయి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ‘జల జీవన్ మిషన్‘ ద్వారా జిల్లాలోని ఒక వెయ్యి 834 ఆవాస ప్రాంతాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయడానికి రూ.515.93 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణం చేపట్టారు. జగనన్న కాలనీల్లో 209 లే అవుట్లలో నిర్మించిన కుళాయిల ఏర్పాటుకు రూ.45.75 కోట్లు కేటాయించారు. గోదావరి నుంచి నేరుగా నీటిని అందించేందుకు మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఇందుకు రూ.1,650 కోట్లు మంజూరు చేశారు.
● ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు‘లో భాగంగా జిల్లాలో మొదటి విడతగా 24,644 గృహాలను ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – వైఎస్సార్ పట్టణ పథకం‘ ద్వారా రూ.443.59 కోట్లతో నిర్మించారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన– వైఎస్సార్ గ్రామీణ‘ పథకం ద్వారా 9,810 గృహాలను రూ.176.58 కోట్లతో నిర్మాణాలు చేపట్టారు.
కలెక్టరేట్

గ్రామాలలో సమగ్రాభివృద్ధి

గ్రామాలలో సమగ్రాభివృద్ధి

గ్రామాలలో సమగ్రాభివృద్ధి

గ్రామాలలో సమగ్రాభివృద్ధి