మెరుగుపడిన రహదారులు.. లంకలకు వంతెనలు | - | Sakshi
Sakshi News home page

మెరుగుపడిన రహదారులు.. లంకలకు వంతెనలు

Jun 12 2025 3:51 AM | Updated on Jun 12 2025 3:51 AM

మెరుగ

మెరుగుపడిన రహదారులు.. లంకలకు వంతెనలు

విద్యా సుగంధాలు

జిల్లాలోని మనబడి నాడు–నేడు పథకం ఫేజ్‌–1లో 436 పాఠశాలలను రూ.104.96 కోట్లతో అభివృద్ధి చేశారు. ఫేజ్‌–2లో 761 పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు రూ.257 కోట్లు మంజూరు చేశారు. ఎస్‌ఎంఎఫ్‌ (స్కూల్‌ మెయింటినెన్స్‌ ఫండ్‌) కేటాయించి పాఠశాలలో చిన్నచిన్న పనులకు రూ.27.76 కోట్లు కేటాయించారు. 142 పాఠశాలకు 945 ఇంటరేక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ (ఐఎఫ్‌పీ)లు అందించారు. ఒక్కొక్క దాని ఖరీదూ రూ.1.25 లక్షలు. దీని ద్వారా డిజిటల్‌ బోధనతోపాటు పాఠాలను డౌన్‌లోడు చేసుకుని కూడా చెప్పే అవకాశం అధికంగా ఉంది.

● జిల్లాలో గడిచిన ఐదేళ్లలో రహదారులు, భవనాల నిర్మాణాలకు రూ.299.40 కోట్లు మంజూరయ్యాయి. రూ.166.4 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. 33 రోడ్లకు రూ.42.87 కోట్లతో మరమ్మతులు చేశారు. రెండవ దశలో రోడ్ల రిపేర్లకు రూ.26.37 కోట్లు ఖర్చు చేశారు.

● కత్తిపూడి –ఒంగోలు మధ్య ఉన్న జాతీయ రహదారి 216 విస్తరణ పనులు వేగంగా సాగడానికి భూసేకరణ చురుగ్గా చేయడమే కారణం. 374 కిమీలు నిడివి ఉన్న ఈ రహదారిని రూ.నాలుగు వేల కోట్లతో విస్తరించింది. దశాబ్దాల కాలంగా రాజోలు దీవివాసులు ఎదురుచూస్తున్న వశిష్ఠ నదిపై వంతెన నిర్మాణానికి ఎన్‌హెచ్‌ రూ.580.42 కోట్ల నిధులు మంజూరు చేసింది. రామరాజులంక వద్ద వశిష్ఠపై 380 మీటర్ల మేర వంతెన నిర్మాణం చేయనున్నారు.

● పి.గన్నవరం మండలం ఉడిమూడిలంక, గంటి పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక వాసుల కష్టాల తీర్చేందుకు రూ.49.50 కోట్లతో వంతెన పనులు మొదలయ్యాయి.

● ముమ్మిడివరం– ఐ.పోలవరం సరిహద్దులను ఆనుకుని వృద్ధగౌతమీ, గౌతమీ నదీపాయల మధ్య ఉన్న పశువుల లంక మొండి వద్ద రూ.49 కోట్లతో వంతెనను పూర్తి చేయించిన జగన్‌మోహన్‌రెడ్డి సీఎం హోదాలో ప్రారంభించారు.

మెరుగుపడిన రహదారులు.. లంకలకు వంతెనలు1
1/2

మెరుగుపడిన రహదారులు.. లంకలకు వంతెనలు

మెరుగుపడిన రహదారులు.. లంకలకు వంతెనలు2
2/2

మెరుగుపడిన రహదారులు.. లంకలకు వంతెనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement