రాష్ట్రస్థాయి తైక్వాండో ఓవరాల్‌ చాంప్స్‌ ‘తూర్పు’ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి తైక్వాండో ఓవరాల్‌ చాంప్స్‌ ‘తూర్పు’

Jun 12 2025 3:49 AM | Updated on Jun 12 2025 3:49 AM

రాష్ట్రస్థాయి తైక్వాండో ఓవరాల్‌ చాంప్స్‌ ‘తూర్పు’

రాష్ట్రస్థాయి తైక్వాండో ఓవరాల్‌ చాంప్స్‌ ‘తూర్పు’

67 పతకాలు కై వసం

నాగమల్లితోట జంక్షన్‌(కాకినాడ సిటీ): అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 11 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లాల తైక్వాండో పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టు పాల్గొని ప్రతిభ కనపరచిందని తైక్వాండో సంఘ జిల్లా కార్యదర్శి బి.అర్జునరావు బుధవారం తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి 80 మంది ఈ పోటీలలో పాల్గొనగా 38 బంగారు, 12 రజత, 17 కాంస్య పతకాలు సాధించి జిల్లా క్రీడాకారులు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ను కై వసం చేసుకున్నారన్నారు. కడప జిల్లా ద్వితీయ స్థానాన్ని, అనంతపురం జిల్లా తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నాయని తెలిపారు. ఈ పోటీలో జాతీయస్థాయి రిఫరీలు భార్గవి, సాయి, రోహిత్‌ జిల్లా నుంచి పాల్గొనగా తైక్వాండో కోచ్‌లు సత్యనారాయణ, మణికంఠ, త్రిమూర్తులను అర్జునరావు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement