
బీవీసీ అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం
అల్లవరం: మండలంలోని కోడూరుపాడు పంచాయతీ పరిధిలోని గుడ్డివానిచింత వద్ద బీవీసీ అక్షర్, బండిగుప్తాపు పాండురంగ సంయుక్తంగా నిర్మించిన ఇంటర్నేషనల్ స్కూల్ని సోమవారం బీవీసీ అధినేత బోనం కనకయ్య, ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన బీవీసీ అక్షర్ స్కూల్ను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, పుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ జక్కంపూడి కిరణ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీను, గొవ్వాల రాజేష్, దొమ్మేటి రాము, సందర్శించి బీవీసీ అక్షర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించారు. బీవీసీ చైర్మన్ బోనం సతీష్, మెట్ల రమణబాబు, దాసం రాంబాబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.