
రామచంద్రపురంలో మాన్సాస్కు ఎసరు
కె.గంగవరం మండలం కోటిపల్లిలోని మాన్సాస్ ట్రస్ట్ భూముల్లో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇసుకతో పాటు బొండు మట్టిపై కూడా అక్రమార్కుల కన్ను పడింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఇసుక తవ్వుకుపోతున్నారు. రోజుకు 100 లారీల వరకూ ఇసుక, మట్టి అక్రమ రవాణా జరుగుతోందని అంచనా. ఇక్కడ తవ్వకాలకు గత నెల 22వ తేదీ వరకూ మైనింగ్ శాఖ అనుమతులున్నట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కాానీ, వాస్తవానికి ఇక్కడ తవ్వకాలకు అనుమతి ఇవ్వకూడదు. రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఆయన ముఖ్య అనుచరులు ఈ దందా నిర్వహిస్తున్నారు.