Sakshi News home page

కర్నూలు: తుపాకీతో కాల్చుకుని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Published Fri, Sep 8 2023 11:20 AM

Head Constable Commits Suicide In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. లోకాయుక్తా కార్యాలయంలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఉన్న సత్యనారాయణ.. గన్‌తో పేల్చుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

సత్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
చదవండి: నా భర్తను తగలబెట్టారు: రవీందర్‌ భార్య

Advertisement

What’s your opinion

Advertisement