మూడేళ్లుగా తమ్ముడి భార్యతోనే సహజీవనం.. కోపంతో మరదలిని

Extramarital Affair: Man Kills Sister In Law Thimmapur - Sakshi

సాక్షి, తిమ్మాపూర్‌(కరీంనగర్‌): పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త, పిల్లలను వదిలేసింది ఓ భార్య.. భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె అతనితో  వెళ్లిపోయింది. చివరికి సహజీవనం చేస్తున్న బావే మరదలిని హతమార్చాడు. ఈ ఘటన కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధి అల్గునూర్‌లో మంగళవారం జరిగింది. ఎల్‌ఎండీ ఎస్సై ప్రమోద్‌రెడ్డి వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన రామ్‌కలి(25)కు భోజరాజుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మూడేళ్ల క్రితం రామ్‌ కలి, భోజరాజు అన్న శ్యామ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. శ్యామ్‌కు పెళ్లి కాకపోవడంతో రామ్‌కలి భర్త, పిల్లలను వదిలేసి 15 రోజుల క్రితం కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్గునూర్‌కు వచ్చారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. 

విచక్షణ కోల్పోయి.. 
కరీంనగర్‌లోని ఓ వ్యాపారి వద్ద ఇద్దరూ మేస్త్రీ, కూలీగా పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం రామ్‌ కలి, శ్యామ్‌ మద్యం తాగారు. ఈ సందర్భంగా రామ్‌ కలి శ్యామ్‌తో గొడవ పడింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన బావ పక్కనే ఉన్న కర్రతో ఆమెపై దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై ప్రమోద్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటన స్థలాన్ని ఏసీపీ కరుణాకర్‌రావు, సీఐ శశిధర్‌రెడ్డి పరిశీలించారు. హత్యకు పాల్పడిన నిందితుడితో మాట్లాడి కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top